బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్, కేటీఆర్, కవిత.. నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అంటున్నారు.. నేనంత పాపం ఏం చేశా..? మీ అవినీతి సొమ్ములో షేర్ అడిగానా? సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్పై భరోసాతో ప్రజలు అధికారం ఇచ్చారు.. ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పే నేతల్ని మహిళలంతా చీపురు తిరగేసి కొట్టండి.' అని అన్నారు.