పాకిస్థాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ మద్యన్ ప్రాంతంలో గురువారం దారుణం జరిగింది. పంజాబ్లోని సియాల్కోట్కు చెందిన వ్యక్తి ఖురాన్లోని కొన్ని పేజీలు తగులబెట్టాడనే ఆరోపణలు వచ్చాయి. అతడిని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన వ్యక్తులు పోలీస్ స్టేషన్పై దాడి చేసి అతడిని ఈడ్చుకెళ్లారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.