కొమ్మూరులో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్