జెండాను ఎగురవేసిన బిఆర్ఎస్ నాయకులు

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కడితో మొదలైన బిఆర్ఎస్ ప్రస్తానం ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్