దేశంలో లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లోని పోలింగ్ బూత్లో జీరో ఓటింగ్ నమోదయ్యింది. బక్స్వాహా తహసీల్లోని మంకి గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరించారు. విద్యుత్, తాగునీరు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు తమకు అందడంలేదని ఆరోపిస్తూ ఓటు వేయలేదు. దీనిని నిరసిస్తూ గ్రామస్తులెవరూ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.