చైనా 2024, ఏప్రిల్ 25న తన రోదసి కేంద్రం ‘తియాంగాంగ్’లోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. యె గువాంగ్ఫు, లీ కాంగ్, లీ గువాంగ్సు అనే ఈ ముగ్గురు వ్యోమగాములు షెంఝౌ-18 వ్యోమనౌకలో నింగిలోకి వెళ్లారు.