సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.