వెంకన్న ఆలయంలో అష్ట పాదపద్మారాధన పూజ

జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం సువర్ణ పద్మాలతో అష్ట పాదపద్మారాధన పూజలు చేపట్టి హారతి సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్