నీట్ వివాదంపై దేశ ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నీట్ పరీక్ష విషయంలో మౌనం వహిస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తమ గళాన్ని వినిపిస్తుందన్నారు. పరీక్ష పేపర్ లీక్లకు వ్యతిరేకంగా బలమైన విధానాల రూపకల్పనకు పార్లమెంటు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీక్కు కేంద్రంగా మారాయని మండిపడ్డారు.