లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. తుక్కుగూడ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. 'గుజరాత్ మోడల్పై ‘వైబ్రెంట్ తెలంగాణ’ ఆధిపత్యం చూపిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. ఈ క్రమంలో 750 మంది చనిపోయారు' అని విమర్శించారు.