పారిస్ ఒలింపిక్స్ కోసం నిర్వహిస్తున్న వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్స్లో భారత బాక్సర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు బ్యాంకాక్లో జరుగుతున్న ఈ పోటీల్లో ముగిసిన 63.5 కిలోల రెండో బౌట్లో అభినాశ్ 5-0తో ఆండ్రీజస్ లావ్రెనోవాస్ (లిథువేనియా)ను చిత్తు చేయగా, నిషాంత్ 71 కిలోల బౌట్లో 5-0తో అర్మాండో బిగాఫా (గినియా బిస్సావు)పై గెలిచి ముందంజ వేశారు.