ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా మరో స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి స్థానం ఫలితంపై చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. తొలి రౌండ్లలో తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధిక్యంలో కొనసాగారు. చివరి రౌండ్లకు వచ్చే సరికి ఫలితం వైకాపా వైపు మళ్లింది.
చివరకు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ 2,597 ఓట్లతో విజయం సాధించారు.