ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్లో భారత్ బోణీ కొట్టింది. డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ రితిక్ రాథీ రజత పతకం గెలుచుకున్నాడు. తద్వారా భారత్కు ఈ ఈవెంట్లో తొలి పతకాన్ని అందించాడు. బుధవారం దుబాయ్లో ఆ పోటీలు జరిగాయి. రితిక్ రాథీ 53.01 మీటర్లు డిస్క్ను విసిరి అత్యుత్తమ త్రోను నమోదు చేసి ప్రశంసలు అందుకున్నాడు.