వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

75చూసినవారు
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైసీపీ నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్