పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్తత

79చూసినవారు
పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్తత
వైసీసీ మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. జనసేన, వైసీపీ కార్యకర్తల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్