హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు

57చూసినవారు
హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
AP: పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ త‌ర్వాత రోజులు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ వర్గీయులపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఒక్క గురజాల నియోజకవర్గంలోనే 100 కేసులు నమోదు చేసి 192 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దాడులు, ఘర్షణలకు సంబంధించిన వీడియోల సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్