మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న కీచక టీచర్పై కేసు నమోదైంది. ఈ ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నెహ్రూనగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న ఏడేళ్ల బాలికపై టీచర్ బి.రామానంద సాగర్ లైగింక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో టీచర్ రామానంద సాగర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.