సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు అట్లా చిన్నవెంకటరెడ్డి తన వర్గంతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మరోవైపు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.