టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి గాజు గ్లాసు గుర్తు గండంగా మారింది. జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోటు ఫ్రీ సింబల్ జాబితాలోనే ఈ గుర్తును ఈసీ ఉంచింది. దీంతో జనసేన బరిలో లేని చోట స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తునే అధికారులు కేటాయించే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూటమి ఓట్లు స్వతంత్రులకు పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు గాజు గ్లాస్ సింబల్ను ఈసీ కేటాయించింది.