కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న ఈ ఫేక్ వీడియో ఘటనపై అమిత్ షా ఘాటుగా స్పందించారు. ఫేక్ వీడియోలతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ ఖాయమన్నారు. మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు.