విలువిద్యలో రాణిస్తున్న గిరిజన యువకుడు

76చూసినవారు
విలువిద్యలో రాణిస్తున్న గిరిజన యువకుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు బైరాగి నాయుడు విలువిద్యలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి, విలువిద్యలో పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నాడు. 2015లో 35వ జాతీయ క్రీడల్లో మొదటిసారి, 2023లో రెండవసారి బంగారు పతకాలు సాధించాడు. జాతీయ క్రీడల్లో సత్తా చాటిన ఈ యువకుడు అంతర్జాతీయంగా ముందుకు వెళ్లలేదు. ప్రభుత్వం సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని చెప్తున్నాడు.

సంబంధిత పోస్ట్