శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బత్తలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అత్తాకోడళ్లు గౌరమ్మ, వెంకటలక్ష్మమ్మ పైకి పుట్టపర్తి వైసీపీ ఎంపీపీ రమణారెడ్డి వాహనం దూసుకెళ్లింది. మహిళలు గుంతలు పూడ్చే పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాల పాలైన గౌరమ్మ బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో మహిళ వెంకటలక్ష్మమ్మకు అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.