ఏపీలో రోడ్డు ప్ర‌మాదం.. మ‌హిళ మృతి

50చూసినవారు
ఏపీలో రోడ్డు ప్ర‌మాదం.. మ‌హిళ మృతి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బత్తలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. అత్తాకోడ‌ళ్లు గౌరమ్మ, వెంకటలక్ష్మమ్మ పైకి పుట్టపర్తి వైసీపీ ఎంపీపీ రమణారెడ్డి వాహనం దూసుకెళ్లింది. మహిళలు గుంత‌లు పూడ్చే ప‌నులు చేస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తీవ్ర‌గాయాల పాలైన గౌరమ్మ బెంగళూరులోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మ‌రో మ‌హిళ వెంకటలక్ష్మమ్మకు అనంతపురంలోని ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్