పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ABP C-VOTER ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 20 సీట్లు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. అధికార వైసీపీకి 05 స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. కూటమికి 47%, వైసీపీకి 40%, కాంగ్రెస్కు 2%, ఇతరులకు 11% ఓట్లు వస్తాయని వివరించింది.