ఈ నెల 19న జరిగే బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబాబాద్ లో మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. నీటి వనరులను పాడు చేసిన ఘనత గత పాలకులది. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం' అని పేర్కొన్నారు.