చంద్రబాబుపై భీమవరం సభలో సీఎం జగన్ నిప్పులు చెరిగారు. "మోసాలు, పొత్తులను నమ్ముకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. సాధ్యం కానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడు. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్నాయి. రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోంది. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలి." అని సీఎం పిలుపునిచ్చారు.