తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని భీమవరం సభలో సీఎం జగన్ వెల్లడించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంతో పాటు మిగతా విమానాశ్రయాల విస్తరణ జరుగుతోందని తెలిపారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు జరుగుతున్నాయన్నారు. స్వయం ఉపాధి రంగం బలోపేతం కోసం ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా సాయం చేస్తున్నామని వివరించారు.