ఆర్‌సీబీ ప్లేయర్లపై భారత మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు

84చూసినవారు
ఆర్‌సీబీ ప్లేయర్లపై భారత మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లపై భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీలో ఆడే ఇండియన్ ప్లేయర్లు తమ భావాలను హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌తో పంచుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ సపోర్టింగ్ స్టాఫ్‌లో ఎక్కువ మంది భారతీయులు లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని వ్యాఖ్యానించాడు. తమ సపోర్టింగ్ స్టాఫ్‌లో ఒకరిద్దరు భారతీయులను తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్