తృణమూల్ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తోంది: మోదీ

72చూసినవారు
తృణమూల్ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తోంది: మోదీ
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తోందని పీఎం మోదీ ఆరోపించారు. అక్కడి దక్షిణ దీనాజ్‌పూర్ జిల్లాలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రసంగించారు. ‘బెంగాల్‌ను గూండాలకు, అక్రమ వలసదారులకు తృణమూల్ లీజుకిచ్చేసింది. శ్రీరామనవమి వేడుకల్ని కూడా చేసుకోనివ్వని పార్టీగా మారింది. అవినీతి, నేరాలు పతాకస్థాయికి చేరాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలపైనా దాడికి పాల్పడుతున్నారు’ అని మోదీ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్