ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.