అరకు: ఘనంగా భగత్ సింగ్, గుర్రం జాషువాల జయంతి

63చూసినవారు
అరకు: ఘనంగా భగత్ సింగ్, గుర్రం జాషువాల జయంతి
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగత్ సింగ్ , గుర్రం జాషువా జయంతి ఘనంగా జరిపారు. ముందుగా భగత్ సింగ్, జాషువా చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ డా నాయక్ మాట్లాడుతూ. భగత్ సింగ్ గొప్ప దేశ స్వాతంత్య్ర సమరయోధిడిగా చరిత్రలో నిలిచిపోయారని, కవిత్వము ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని కొనియాడారు. అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్