విషాదం.. పాము కాటుకు గురై బాలిక మృతి

1044చూసినవారు
హుకుంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. బూర్జ పంచాయతీలోని వచనరంగినికి చెందిన కిల్లో. భాను(15) అనే బాలిక మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. దీనితో భానుకి కుటుంబీకులు 108లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే భాను చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. భాను మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని బాలిక తల్లిదండ్రులు కంటతడి పెట్టారు.

సంబంధిత పోస్ట్