గిరిజన సొసైటీతో జిప్ లైన్ కొనసాగాలి: జడ్పిటిసి

53చూసినవారు
గిరిజన సొసైటీతో జిప్ లైన్  కొనసాగాలి: జడ్పిటిసి
అనంతగిరి మండల కేంద్రంలో గల బొర్రా గ్రామపంచాయతీలో బుధవారం స్థానిక జడ్పిటిసి దిసారి గంగరాజు పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బొర్రాపంచాయతీలో 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతంలో అనధికారికంగా ప్రైవేట్ వ్యక్తులు జస్టిన్ జోసెఫ్, శ్రీనివాస్, నిర్మాణం చేపట్టి ఉన్న జిప్ లైన్ టెండర్లను తక్షణమే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.9 నెలలుగా ట్రాయల్ రన్ పేరిట గిరిజనులకు మభ్య పెట్టి మూడు కోట్ల రూపాయలు మోసగించి దోచుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్