రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు చోడవరం విద్యార్థులు

75చూసినవారు
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు చోడవరం విద్యార్థులు
ఈ నెల 5, 6, 7 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు చోడవరం నుండి ఇద్దరు విద్యార్థులు పాల్గొంటున్నట్లు పతంజలి యోగ శిక్షణ కేంద్రం యోగ గురువు పుల్లేటి సతీష్ శుక్రవారం మీడియాకు తెలిపారు. పోటీల్లో గొంతిన లయ వర్ధన్, పొట్నూరు పవన్ కుమార్ పాల్గొంటారన్నారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలాని పలువురు అభినందనలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్