సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో లక్ష్మికి డాక్టరేట్

52చూసినవారు
సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో లక్ష్మికి డాక్టరేట్
విశాఖ‌లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధకురాలు ఎం. లక్ష్మికి ఏయూ డాక్టరేట్ లభించింది. విభాగాధిపతి ఆచార్య సి. ఎన్. వి సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో జరిపిన పరిశోధనకు డాక్టరేట్ అందుకున్నారు. ఈమేరకు ఆదివ‌రం ఆమె ఈవిష‌యాన్ని మీడియాకు వివ‌రించారు. గుజరాత్ రాష్ట్రంలోని 22 బ్రిడ్జిల వద్ద 44 బోర్ హోల్స్ నుంచి మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో అధ్యయనం చేసి మట్టి దృఢత్వాలను గుర్తించారు.

సంబంధిత పోస్ట్