పీసా చట్టాన్ని అమలు చేయాలని నిరసన

79చూసినవారు
పీసా చట్టాన్ని అమలు చేయాలని నిరసన
గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించే పీసా చట్టాన్ని అమలు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు మండలంలోని డల్లపల్లిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరావు మాట్లాడుతూ పాడేరు మండలంలోని రహదారికి ఇరువైపులా ఉన్న స్థలాలను గిరిజనేతరులు ఆక్రమించి వ్యాపార దుకాణ సముదాయలు నిర్మిస్తున్న అధికారుల్లో చలనం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్