విశాఖపశ్చిమ నియోజకవర్గంలోని ఐటీఐ కూడలి సంకురపేటలో వెలసిన పైడిమాంబ అమ్మవారి నెల పండగను పురస్కరించుకుని గ్రామాధ్యక్షుడు మురళీ నేతృత్వంలో ఆదివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. అంతకు ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎంపీ ఎంపీ భరత్, కంచరపాలెం సీఐ భాస్కర్రావు పాల్గొన్నారు. సుమారు 6వేల మందికి అన్నదానం చేశారు.