ప్రకాశం జిల్లాలో ఆకట్టుకుంటున్న కదిలే వినాయకుడు

81చూసినవారు
గణేష్ నవరాత్రుల సందర్భంగా వెరైటీ వినాయకుడి విగ్రహలు దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బోయపాలెంలో కదిలే వినాయకుడిని రూపొందించారు. రూ.4 లక్షల విలువ చేసే 22 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణేష్ విగ్రహానికి వెనక వైపు సుదర్శన చక్రం తిరుగుతూ ఆకట్టుకుంటుండగా.. ఆశీస్సులు ఇస్తున్నట్లు వినాయకుడి చేయి కదులుతుంది. విగ్రహానికి కుడివైపు గుండెలను చీలుస్తూ సీతారాముల విగ్రహాలను చూపుతూ హనుమంతుడు, మరోవైపు శ్రీరాముడు విగ్రహాలతో కూడిన ఈ గణేషుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్