తిరుమలలో జరిగింది దురదృష్టకరమైన ఘటన: పవన్

72చూసినవారు
తిరుమలలో జరిగింది దురదృష్టకరమైన ఘటన: పవన్
AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. బుధవారం కేరళలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తిరుమలలో జరిగింది దురదృష్టకరమైన ఘటన. ఆలయాల నుంచి ఆదాయం పొందేందుకు ప్రయత్నించకూడదు. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై నేను చాలా బాధపడ్డాను. ప్రశ్నించాను. తప్పు చేసిన వారు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాం.’ అని పవన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్