చోడవరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో జూపూడి ప్రభాకరరావు పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాల మహానాడు కార్యదర్శి సియ్యాద్రి శ్రీనివాసరావు అద్వర్యంలో నిరసన కార్యక్రమంచేపట్టారు. మాలమహానాడు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉదయం నుండి బస్ లు రాకపోకలు నిలుపు చేశారు. అన్నీ ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి