గుంటూరులో గుర్తు తెలియని మహిళ మృతి
గుంటూరులో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై గుంటూరు రైల్వే పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంజీవ్ నగర్ లోని రైల్వే గూడ్స్ షెడ్ ఆవరణలో ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. అక్కడి వారు గమనించి అంబులెన్స్ లో ఆమెను జీజీ హెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఆ మహిళ పేరు, వివరాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.