అక్రమ చేపల పెంపకాన్ని నిషేధించాలి: సిపిఎం

61చూసినవారు
దేవరాపల్లి మండలంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో గల చెరువుల్లో సాగవుతున్న అక్రమ చేపల పెంపకాన్ని నిషేధించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం దేవరాపల్లిలో మాట్లాడుతూ.. చేపలు పెంపకానికి గొడ్డు మాంసం, వివిధ జంతువులకు సంబంధించిన వ్యర్థాలను చెరువుల్లో కలుపుతున్నారని అన్నారు. ఈ విధంగా పెరిగిన చేపలను తింటున్న ప్రజలు రోగాలు పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి స్పందన కనిపించలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్