కోటవురట్ల మైదాన ప్రాంతంలో ఆటలు పోటీలు

70చూసినవారు
కోటవురట్ల మైదాన ప్రాంతంలో ఆటలు పోటీలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదాన ప్రాంతంలో హెచ్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో మండల స్థాయి ఆటలు పోటీలు నిర్వహిస్తున్నట్లు పిడి గణేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 19 నుండి నాలుగు రోజులపాటు మండల స్థాయిలో ఆటలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో కే. వెంకటాపురం, పాములవాక, జల్లూరు, కోటవురట్ల హైస్కూలు, బాలికోన్నత పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్