రైతులందరూ ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి

84చూసినవారు
రైతులందరూ ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి
పామిడి మండల కేంద్రంలో పంటలను సాగు చేసిన రైతులందరూ ఈ-పంట నమోదుతో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి లీనా వసుంధర ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో 4963 మంది రైతులు మాత్రమే ఈ కేవైసీ చేశారు. ఈ పంట నమోదు చేసుకుని మిగిలిన రైతులకు కూడా ఈ నెల 23వ తేదీ లోపు ఈ కేవైసీ చేయించుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్