బాబు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన

74చూసినవారు
బాబు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన
గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇంతియాజ్ షఫీ అనే ఏడాది బాలుడు జ్వరంతో బాధపడుతుండగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజుల కిందట చికిత్స కోసం చేర్పించారు. బుధవారం బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్