కళ్యాణదుర్గం: ఉపాధిపనులను ప్రతిఒక్కరు సద్వి నియోగం చేసుకోవాలి

75చూసినవారు
బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి, వేపులపర్తి గ్రామాల్లో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. అధికారులకు ప్రజలు పలు సమస్యలుపై వినతులు అందజేశారు. అనంతరం వేపులపర్తి దళితవాడలో నూతన సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బీటీపీ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్