రాయదుర్గం పట్టణంలో ఒకే చోటికి చేరుకొని పోటాపోటీగా ప్రచారం చేసిన వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు. ఈరోజు శుక్రవారం కావడంతో ముస్లింలు నమాజులు ముగించుకొని బయటకు వస్తుండగా అరబిక్ కాలేజ్ సమీపాన మసీదు వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నపయ్య ముస్లిం సోదరులను ఓటు అభ్యర్థించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.