జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో జన రంజకంగా ఉంది

1037చూసినవారు
రాయదుర్గం పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తన నివాసం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో జన రంజకంగా ఉందని కొనియాడారు. అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. చెప్పాడంటే చేస్తాడు అంతే అన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని పేర్కొన్నారు. మరోమారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తద్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్