ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు

78చూసినవారు
ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు
ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగిం చిందని పుట్లూరు మండల వ్యవసాయాధికారి కాత్యాయిని తెలిపారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ తొలుత ఈ నెల 15వతేదీ వరకు గడువు వుండగా తాజాగా ఈ నెల 30వతేదీ వరకు పొడిగించిందన్నారు. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. పిఎంఎఫ్ బీవై, వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్