తాడిపత్రి మండలం లో పర్యటించిన మాజీ ఎంపీ

56చూసినవారు
తాడిపత్రి మండలం లో పర్యటించిన మాజీ ఎంపీ
తాడిపత్రి మండలంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం పర్యటించారు. మండలంలోని అక్కన్నపల్లి, వీరాపురం, బొందలదిన్నె గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి బాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను జేసీ దివాకర్ రెడ్డి వారికి వివరించారు.

సంబంధిత పోస్ట్