నల్ల పసుపుకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో విలువ ఉంది. దీనిని నేలకంఠ, నడకచోరా, కృష్ణకేతారా అనే పేర్లతో కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లోని తూర్పు కనుమల్లో ఇది లభిస్తుంది. నల్ల పసుపు కొమ్ములు గుమ్మానికి కడితే దుష్ట శక్తులు ఇంట్లోకి రాలేవని నమ్ముతారు. నల్ల పసుపును శనివారం పూజచేసి బీరువా లేదా గల్లా పెట్టలో ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు.